AP: పల్నాడు జిల్లా క్రోసూరు పోలీస్ స్టేషన్లోషాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం ఆరోపణలపై విచారణకు వచ్చిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్న సమయంలో ఫిట్స్ వచ్చి కిందపడిపోయిందని, ఆపై మరణించిందని చెబుతున్నారు. అయితే, ఈ ఘటనను క్రోసూరు పోలీసులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.