మహిళల
టీ20 ప్రపంచకప్లో భాగంగా నేడు సౌతాఫ్రికా-బంగ్లాదేశ్,
భారత్-
ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు SA vs BAN మ్యాచ్ జరగనుండగా, రాత్రి 7 గంటలకు IND vs AUS మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఒకవేళ బంగ్లాదేశ్పై సౌతాఫ్రికా గెలిస్తే..
ఆస్ట్రేలియాపై భారత్ తప్పకుండా గెలవాలి. అదే బంగ్లాదేశ్ గెలిస్తే
ఆసీస్ చేతిలో ఓడినా సఫారీల కంటే మెరుగైన నెట్ రన్రేట్ ఉండటం వల్ల భారత్కు సెమీస్ ఛాన్స్ ఉంటుంది.