ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం రాత్రి గౌహతిలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ జట్టు తరఫున 100 సిక్సులు బాదిన బ్యాటర్గా రికార్డుల్లో నిలిచాడు. ఈ ఘనత సాధించిన నాల్గవ ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. అంతకుముందు సంజు శాంసన్ (192), జోస్ బట్లర్ (135), షేన్ వాట్సన్ (109) ఈ జాబితాలో ఉన్నారు.