AP: కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి
వైసీపీ కార్యకర్త సోషల్ మీడియాలో బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డాడు. 'చావడానికైనా.. చంపడానికైనా సిద్ధం' అంటూ
వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేని టార్గెట్ చేయడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందనే కోణంలో చర్చ జరుగుతోంది.
వైసీపీ కార్యకర్త వ్యాఖ్యలపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.