ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో సమావేశమై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు తరహాలోనే నకిలీ మద్యం కేసు ఉందని, వైసీపీ నేతలు అంతా చేసి తమపై నిందలు మోపుతున్నారని విమర్శించారు. క్రిమినల్ మాస్టర్మైండ్కు జగన్ ఉదాహరణ అని, తమ నేరాలను టీడీపీపై నెట్టే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. వైసీపీ నేర కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు.