AP: సత్యసాయి జిల్లాలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. బిల్లుల మంజూరు విషయంలో రొళ్ల ఎంపీడీవో నాగేశ్వరశాస్త్రిపై వైసీపీ మాజీ ఎంపీపీ భర్త విజయరంగేగౌడ్ దాడికి పాల్పడ్డారు. ఎంపీడీవోను దుర్భాషలాడుతూ విజయరంగేగౌడ్ పిడిగుద్దులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎంపీడీవో నాగేశ్వరశాస్త్రి, విజయరంగేగౌడ్ ఇరువురూ పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు.