AP: నెల్లూరు జిల్లా పొన్నపువారిపాలెంలో సీఎం చంద్రబాబు YCPపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒక గొడ్డలిపార్టీ ఉందని, ప్రజలు కూడా దానిని అలాగే పిలవాలని సూచించారు. రౌడీలతో రాజధాని రైతులపై దండయాత్రకు వెళ్లారని, మూడు రాజధానులంటూ మూడు ముక్కల ఆట ఆడారని విమర్శించారు. హోంమంత్రి అనితపై మేకప్ అంటూ కామెంట్లు చేస్తున్నారని, ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరిరోజు అవుతుందని హెచ్చరించారు.