ఝార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేయసితో పెళ్లికి ఒప్పుకోలేదని లోకేశ్ అనే యువకుడు ప్రేయసి తల్లిదండ్రులను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఫేస్బుక్లో హిరాముని అనే యువతికి లోకేశ్తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో లోకేశ్ పెళ్లి చేయాలని యువతి తల్లిదండ్రులను చాలా సార్లు కోరాడు. దానికి వారు నిరాకరించడంతో కోపం పెంచుకున్న లోకేశ్ కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు.