ఉత్తరాఖండ్లోని శ్రీనగర్లో ఢిల్లీ టూరిస్టులు, స్థానిక యువకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఢిల్లీ నుంచి వచ్చిన పర్యాటకులు రాంగ్ సైడ్లో కారు నడుపుతుండగా, ఒక స్థానిక స్కూటీ ప్రయాణికుడు వారిని నిలదీశాడు. ఇది కాస్తా పెద్ద గొడవగా మారి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, పరిస్థితిని అదుపు చేయడానికి లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. పర్యాటకుల నిర్లక్ష్యం వల్ల ఈ ఉద్రిక్తత నెలకొంది.