బిహార్లోని షియోహార్కు చెందిన రేఖా కుమారి(20) చెవి వ్యాధితో చికిత్స కోసం పాట్నాలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ తర్వాత నర్సు నరానికి బదులుగా ధమనిలో ఇంజెక్షన్ ఇచ్చారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. రేఖా కుమారి నొప్పి వస్తుందని చెప్పినా, ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో రేఖా కుమారి చేతిని తొలగించాల్సి వచ్చిందన్నారు. నవంబర్లో జరగాల్సిన పెళ్లి కూడా రద్దయిందని కుటుంబసభ్యులు తెలిపారు.