AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ గుంటూరులోని ఆటోనగర్ సెంటర్కు చేరుకున్నారు. కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అయితే చెక్ పోస్టు పెట్టి జగన్ కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. జగన్ పర్యటనపై అడుగడుగునా కూటమి కుట్రలకు పాల్పడుతోందని వైసీపీ విమర్శించింది. జగన్ పర్యటనకు వైసీపీ శ్రేణులు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించిందని మండిపడింది.