AP: కృష్ణా జిల్లా మొవ్వ మండలం నిడుమోలు గ్రామానికి వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. మొంథా తుఫాన్తో దెబ్బతిన్న వరి పంటతో రైతులు నిలబడి.. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రైతుల సమస్యలు తెలుసుకుంటూ జగన్ ముందుకు కదులుతున్నారు. కిక్కిరిసిన రోడ్లపై జగన్ అందరికీ అభివాదం చేస్తున్నారు. కాగా, కృష్ణా జిల్లాలో తుఫాన్తో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు జగన్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే.