AP: మాజీ సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్పై వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ విపత్కర పరిస్థితిలో సీఎం ఒక రోజు చాపర్లో తిరిగి, మరుసటి రోజు లండన్కు పోతారు. ఆయన కొడుకు ఆస్ట్రేలియా నుంచి వచ్చి, ఆ మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడటానికి పోతాడు" అని ఎద్దేవా చేశారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నా, ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని జగన్ తీవ్రంగా మండిపడ్డారు.