AP: వందేమాతరం గీతంపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. 'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం. బంకించంద్ర ఛటర్జీ రచించిన ఈ పవిత్ర గీతం మన స్వాతంత్య్ర సమరయోధులలో రగిలించిన ఐక్యతా భావనే మనందరికీ ఆదర్శం. ఆ స్ఫూర్తితో మన భావితరాల కోసం, వారి అభివృద్ధికోసం కలిసి పనిచేద్దాం’ అని జగన్ పిలుపునిచ్చారు.