AP: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విద్యార్థి విభాగం నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి నేతలు ఈ భేటీలో పాల్గొనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో విద్యార్థుల సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ వంటి పలు కీలక అంశాలపై జగన్ చర్చించనున్నారు. కాగా, నవంబర్ 4న తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే.