AP: కార్మికులు సమాజ హితమే ధ్యేయంగా శ్రమించేవారని, దేశాభివృద్ధికి, ప్రగతికి వారే కీలకమని, ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటివారని, అభివృద్ధి వెలుగులకు జీవం పోసే కనిపించని హీరోలు అని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు.