AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తన విచారణను వేగవంతం చేసింది. హైదరాబాద్లోని విచారణకు హాజరు కాలేమని తెలిపిన కిరణ్ కుమార్ యాదవ్, మహేంద్ర యాదవ్, భరత్ యాదవ్ అనే ముగ్గురికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో సీబీఐ బృందం స్వయంగా పులివెందుల చేరుకుంది. మరికొద్దిసేపట్లో ఈ ముగ్గురిని కీలక అంశాలపై విచారించనుంది.