
లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత పుల్లూరి ప్రసాద్
TG: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ కీలక నాయకుడు పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మరో మావోయిస్టు బండి ప్రకాశ్తో కలిసి మరికాసేపట్లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోనున్నాడు. ఈ పరిణామం మావోయిస్టు సంస్థకు పెద్ద షాక్గా మారింది.




