తొండూరు మండలం యాదవవారి పల్లెకు చెందిన లక్ష్మీదేవి అనే యువతి శనివారం సాయంత్రం కుటుంబ కలహాల కారణంగా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఆదివారం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.