AP: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి చెందిన మాలపాటి భాస్కర్ రెడ్డి లండన్లో ఉంటున్నాడు. వైసీపీ హయాంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ మెసేజ్లు చేసేవాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. టీడీపీ కార్యకర్తలు ఆయనపై ఫిర్యాదు చేశారు. అయితే లండన్ నుంచి వచ్చిన భాస్కర్ రెడ్డిని శుక్రవారం ఎయిర్పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు.