టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
వైసీపీ అధినేతకు మానసిక సమస్య ఉందని, గతంలో అవకాశమిస్తే అందరినీ మోసం చేసి, నాశనం చేశారని ఆరోపించారు. ప్రజావేదికను రెండు గంటల్లో కూల్చివేశారని, అమరావతి, పోలవరం ప్రాజెక్టులను నాశనం చేశారని, అమరావతిని శ్మశానం అని ప్రచారం చేశారని విమర్శించారు. విపక్షంలో ఉండేది
వైసీపీ కాదని.. 'గొడ్డలి పార్టీ' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.