CM చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.