
భారత్ vs బంగ్లాదేశ్ మ్యాచ్లో ఆసక్తికర సన్నివేశం.. చేయి కలపని కెప్టెన్లు!
జింబాబ్వేలోని బులేవాయోలో జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026 మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టాస్ సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ అనారోగ్యంతో దూరమవడంతో వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ జట్టు పగ్గాలు చేపట్టాడు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే భారత కెప్టెన్ ఆయుష్ మ్హత్రే, జవాద్ అబ్రార్ మధ్య ఎలాంటి షేక్ హ్యాండ్ జరగలేదు. వారి ముఖాల్లో కోపం, ఆవేశం స్పష్టంగా కనిపించాయి. జాతీయ గీతం ఆలపించే సమయంలోనూ, ఆటగాళ్లు మైదానంలోకి వెళ్లేటప్పుడు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది.




