ముల్లన్పుర్ వేదికగా రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు 10 ఓవర్ల ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ 38 పరుగులు చేసి క్రీజులో నిలిచాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 5 పరుగులతో ఉన్నాడు. కూపర్ 14 బంతుల్లో 3 సిక్సులు, 2 ఫోర్లతో 30 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. ప్రియాంశ్ ఆర్య 11 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్తో 29 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యశ్రాజ్ ఒక్కో వికెట్ తీశారు.