ఢిల్లీ పేలుళ్ల తరువాత ఫరిదాబాద్లో ఉన్న ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచి 10 మంది అదృశ్యమయ్యారని నిఘా వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులు, సిబ్బందితో కూడిన ఈ 10 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయని, సంప్రదించడానికి ప్రయత్నించగా ఫలితం లేదని నిఘా వర్గాలు తెలిపాయి. ఇందులో ముగ్గురు కాశ్మీర్ వారు కూడా ఉన్నారు. వీరంతా టెర్రర్ డాక్టర్ మాడ్యూల్లో భాగమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.