దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) గ్రూప్ 'బి', గ్రూప్-సి విభాగాల్లో 25 రకాల పోస్టుల కోసం 1,979 ఖాళీలను భర్తీ చేయనుంది. టీజీటీ (కంప్యూటర్), స్పెషల్ ఎడ్యుకేటర్ (ప్రైమరీ), టీజీటీ స్పెషల్ ఎడ్యుకేటర్ టీచర్, డొమెస్టిక్ టీచర్, ఐటీ అసిస్టెంట్ గ్రేడ్-ఏ వంటి పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు జులై 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు https://dsssb.delhi.gov.in/ వెబ్సైట్ను సందర్శించగలరు.