ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’పై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. మొబైల్ఫోన్లు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో అపార అవకాశాలున్నాయని చెప్పారు. పెట్టుబడులకు భారత్ అత్యుత్తమ గమ్యమని పేర్కొన్నారు. భారత్ రెండో అతిపెద్ద 5జీ మార్కెట్గా ఎదిగిందని, బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ సేవలు ప్రారంభించడం దేశ గౌరవమని మోదీ అన్నారు.