మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్లో 250 ఏళ్ల నాటి ఆలయం బయటపడింది. పవన నది సమీపంలో 250 ఏళ్ల నాటి రిద్ధి-సిద్ధి గణపతి ఆలయాన్ని స్థానికులు గుర్తించారు. స్థానిక చరిత్రకారులు ఈ ఆలయ వయస్సు సుమారు 250 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీనిని ఆర్కియాలజీ అధికారులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు.