TG: మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సతీష్ అనే వ్యక్తి ఏళ్ల బాలికకు కుర్కురే ప్యాకెట్ ఇప్పిస్తానని ఆశ చూపి అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను పత్తి చేనులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి, అనంతరం గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని బావిలో పడేశాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు చేపట్టగా.. సతీష్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. నిజం ఒప్పుకున్నాడు.