
రోడ్డు పక్కన భోజనం చేసిన రజనీకాంత్
ప్రముఖ నటుడు సూపర్స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక చింతనతో ప్రతీ ఏడాది హిమాలయాలను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం ఆయన బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అంతకుముందు ఆదివారం రిషికేశ్లోని స్వామి దయానంద ఆశ్రమాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన రోడ్డు పక్కన విస్తరాకుల్లో భోజనం చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ తలైవా అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.




