యూపీలోని హమీర్పూర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రవి, మనీషా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మనీషా తల్లిదండ్రులు మనీషాకు మరో వ్యక్తితో పెళ్లి కుదుర్చారు. అయితే చివరిసారిగా మనీషా(18)ను కలవడానికి రవి వెళ్ళగా, ఆమె కుటుంబ సభ్యులు వారిని పట్టుకుని రవిని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో రవి మృతి చెందగా, ఈ విషయం తెలుసుకున్న మనీషా ఆత్మహత్య చేసుకుంది. నవంబర్ 2న మనీషా వివాహం జరగాల్సి ఉంది.