మధ్యప్రదేశ్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఉత్పత్తి అధికంగా ఉండటం, బంగ్లాదేశ్కు ఎగుమతులు నిలిపివేయడంతో కేజీ ఉల్లి 20 పైసలకు పడిపోయింది. ఒక కేజీ పండించడానికి రూ.10 ఖర్చవుతుందని, నష్టాలతో రైతులు నిలదొక్కుకోలేకపోతున్నారని, అందుకే రోడ్డుపై పారేస్తున్నామంటూ వాపోతున్నారు. ఈ పరిస్థితిపై ఓ రైతు సంఘం నేత ట్వీట్ చేయగా, పలువురు నెటిజన్లు “వ్యవసాయ చట్టాలను అడ్డుకున్నందుకే ఇలాంటి పరిస్థితి. అవి అమల్లో ఉంటే రైతులు దేశవ్యాప్తంగా ఆన్లైన్లో అమ్ముకొని మంచి ధర పొందేవారు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.