ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ రీజియన్లో, రోడ్డు దాటుతున్న ఇద్దరు పిల్లలను కారు ఢీకొట్టకుండా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కారును ఆపారు. ఈ ఘటన వాహనంలో అమర్చిన కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో వైరల్ అవుతుండగా, రెప్పపాటులో రెండు ప్రాణాలు నిలిచాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రోడ్లపై అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన తెలియజేస్తోంది.