TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘తాల్ హాస్పిటల్స్ హెల్త్ఫెస్ట్ 2025’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆయనకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని తాల్ హాస్పిటల్స్ సీఈఓ సాయి గుండవెల్లి హైదరాబాద్లో కేటీఆర్కు స్వయంగా అందజేశారు. వచ్చే నెల 24న కాలిఫోర్నియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగోలో ఈ ‘హెల్త్ఫెస్ట్ 2025’ నిర్వహించనున్నారు.