AP: అల్లూరి జిల్లా దేవిపట్నం మండలం పరగసానిపాడు గ్రామంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో విషాదం చోటుచేసుకుంది. రాజు అనే యువకుడు బ్యాటింగ్ చేసి అవుట్ అయిన తర్వాత, నీళ్లు తాగి విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అతన్ని గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.