AP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వేముల శశి అనే మరుగుజ్జు వ్యక్తిని, ఒక ముస్లిం యువతి ప్రేమించి వివాహం చేసుకుంది. 9వ తరగతిలో స్నేహంగా మొదలైన వీరి పరిచయం ప్రేమగా బలపడింది. శశి శారీరక స్థితిపై అభ్యంతరాలు, కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని, ఒత్తిడి ఎదురవడంతో ఈ జంట రహస్యంగా వివాహం చేసుకుని పోలీసుల రక్షణ కోరారు. అందం, ఆస్తి కంటే అనురాగమే ముఖ్యమని చాటిచెప్పిన ఈ యువతి ధైర్యంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.