అభిషేక్ శర్మ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకే క్యాలండర్ ఇయర్లో 100 సిక్సర్లు బాదిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచారు. SMATలో సర్వీసెస్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ తరఫున ఆడుతూ అభిషేక్ 3 సిక్సర్లు బాది ఈ ఘనత సాధించారు. ఈ ఏడాది టీ20ల్లో అభిషేక్ 1,499 పరుగులు చేశారు, ఇందులో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత ఏడాది నికోలస్ పూరన్ 170 సిక్సర్లు బాదినట్లు పేర్కొన్నారు.