ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం పాకిస్తాన్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. పాక్ ఇచ్చిన 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 74 అర్థ శతకం, శుభ్మన్ గిల్ 47 పరుగులతో రాణించారు. తిలక్ వర్మ (30*), సంజు శాంసన్ (13), హార్దిక్ (7) పరుగులు చేశారు.