ఆసియా కప్ 2025లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్తో సంచలనం సృష్టిస్తున్నాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన రెండో భారత బ్యాటర్గా (విరాట్ కోహ్లీ తర్వాత) రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్పై 37 బంతుల్లో 75 పరుగులు చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు పాక్పై 24 బంతుల్లో 50 స్కోర్ చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 248 పరుగులు, 17 సిక్సర్లతో జయసూర్య రికార్డును బద్దలు కొట్టాడు.