ఆదిలాబాద్ జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల ప్రభుత్వ వసతి గృహాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 100% ప్రవేశాలు కల్పించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలో పర్యటించి పలు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని సూచించారు.