ఆదిలాబాద్లో ఆదివారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో షహీద్ భగత్ సింగ్ 118వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్ మాట్లాడుతూ, నేటి యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్ల వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న భగత్ సింగ్ త్యాగాలను గుర్తు చేసుకున్నారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.