ఆదిలాబాద్ శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సోమవారం గీత సమాజం ఆధ్వర్యంలో జరిగిన గీతా జయంతి వేడుకల్లో శ్రీ యోగానంద సరస్వతి మాట్లాడుతూ, అన్ని వేదాల సారమైన భగవద్గీతను చదివి ఆచరణలో పెడితే జీవితంలో సత్ఫలితాలను పొందవచ్చని తెలిపారు. భగవద్గీత సమస్త మానవాళి జీవన విధానం గురించి వివరిస్తుందని, గీతా జయంతి రోజున సంపూర్ణ భగవద్గీత పారాయణం జరుపుతున్నట్లు ఆయన వివరించారు. భక్తులకు గీత సారాంశాన్ని వివరించారు.