కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ డిమాండ్ చేశారు. గురువారం ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. వివాదాస్పద నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, పాత కార్మిక చట్టాలనే కొనసాగించాలని వారు కోరారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.