మంగళవారం ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూప్లలి కృష్ణారావు మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వ రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటనపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు.