బేల మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా ప్రారంభించబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ఆదివారం సందర్శించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను స్థానిక నాయకులు ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు సంతోష్, పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, తదితరులున్నారు.