ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షాల వల్ల రంగు మారిన సోయాబీన్ పంటను రైతుల నుంచి వెంటనే కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం వెంటనే మార్క్ఫెడ్ ద్వారా పంట కొనుగోలు చేపట్టాలని, ప్రకృతి వైపరీత్యం వల్ల ఇప్పటికే రైతులు తీవ్ర నష్టపోయారని ఆయన అన్నారు.