గురువారం ఆదిలాబాద్లోని ప్రజా సేవ భవన్లో జరిగిన కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకురాలు తన్నీరు నవత, బీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, స్థానిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అంతా కలసి ముందుకు సాగుతామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు.