మేడే సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఛైర్పర్సన్ అనూషతో కలిసి మున్సిపల్ కార్మికులకు సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక కార్మికురాలి కాళ్లకు ఎమ్మెల్యే స్వయంగా చెప్పులు తొడిగి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కార్మికులు ఆరోగ్యాన్ని మహాభాగ్యంగా భావించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ రోహిత్, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్లు కూడా పాల్గొన్నారు.