ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ అనూష అధ్యక్షతన బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో వార్డుల్లో నెలకొన్న పౌర సమస్యలపై సభ్యులు అధికారులను నిలదీశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ నగేశ్, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో 16 అజెండా అంశాలపై చర్చించారు.