విశ్రాంత కార్మిక శాఖ అధికారి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, కార్మిక శాఖ ద్వారా కార్మికులకు అందే సంక్షేమ ఫలాలు సక్రమంగా అందించాలని 20 ఏండ్లుగా కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈనెల 4న ఆదిలాబాద్కు సీఎం రాక సందర్భంగా తమను కలిసి తమ గోడు చెప్పుకునేలా అవకాశం కల్పించాలని మంగళవారం మీడియా సమావేశంలో ఆయన కోరారు. ప్రభుత్వానికి లాభాలు తెచ్చిపెడుతున్న కార్మికుల విన్నపాలపై ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు.